Tuesday, September 29, 2015

బహుముఖంగా
---------------రావెల పురుషోత్తమరావు.
=====================================



ఒకప్పుదు నాకు
ఒక్క ముఖమే వుండేది
అందరి ఆదారాభిమానాలను
చూరగొంటూ ఆదర్శంగా
బ్రదుతుండేవాడిని.

ఆతర్వాత రెండుముఖాలొచ్చాయి
ఆంతరింగికంగా ఒక విధంగా
బాహిరకంగా మరో రకంగా
పరిచయమవుతూ పరకాయప్రవేశం
చేసే వాడిగా అందరినోళ్ళలో
పలుచబడిపోయాను.

ఇప్పుడిలా కాలక్రమేణా
రాజకీయాన్నాశ్రయించగానే
ఒక్కౌదుటన బహుముఖాలొచ్చి
బరితెగించిపోతున్నాను.

రాజధాని నిర్మాణంకోసం
రైతులచేతుల్లోంచి పచ్చని
పంటపొలాలను గుంజుకునేస్థితిలో
ఒక రకంగా ప్రత్యక్షమౌతాను.
దేబిరించే ముఖంతో
 దీనంగా ప్రత్యక్షమౌతుంటాను.

అవినీతి అక్రమాలకు
అడ్డాగా నిలిచినప్పుడు
ఎర్రబడినమొహంతో
పేత్రేగిపోతుంటాను.

ఓదార్పు యాత్రలప్పుడూ
పరామర్శపేరుతో
 పలకరింపులకెళ్ళినప్పుడూ
దీనాలాపం పులుముకుని
దిష్టి బొమ్మనుపోలి నిలుచుంటాను.
రంగులు మార్చుకునే రాజకీయానికి నేనే
వూసరవల్లికి కూడా మార్గదర్శినైపోయాను.


నేనే నిర్వచనమై సోపపత్తికంగా
నిర్వచనంగాకూడానిలబడిపోయాను.
ఇన్నిముఖాల కవళికలమధ్యన
అసలు ముఖ కవళికలు అదృశ్యమై
అన్ని సమయ సందర్భాలలోనూ
వివర్ణుడనై వెకిలిగా అందరికీ
కనబడుతూ నవ్వుతాలుగామారిపోయాను.
--------------------------------
ఈకవిత నా స్వంతం దేనికీ అనువాదంగానీ
అనుసరణగానీ కాదనీ ఇది
ఎక్కడా ప్రచురితంకాలేదనీ మనవి.]

No comments:

Post a Comment