Tuesday, September 8, 2015

పగలే వెలుగుతూన్న
పట్టణ మునిసిపల్ దీపంలా
భారతం ఎలాతెలాపోతుంటే
దేశం వెలిగిపోతున్నదని
మాయలాంతరు పట్టుకున్న
అధినాయకత్వం ఆత్మస్తుతి
మొదలెట్టింది.

ఇక పరనిందలపర్వంలో
అటు అధికార పక్షం
ఇటు ఊసుపోని ప్రతిపక్షం
ఒకరైపై ఇంకొకరు వ్యంగ బాణాలు
సంధిచుకోవడం సాధికారంగా ప్రారంభించారు.

స్వచ్చ భారత్ ధర్మమాని
ప్రతినగరం చెత్తకుప్పలా తయారయింది.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
కార్మికలోకం కళ్ళప్పగించి చూస్తున్నది.

సమ్మెలూ ఘెరావులూ సమకాలీన సమాజ
 జీవితపు  సంక్షేమానికి సాక్ష్యమని
నిత్య సంఘర్షణలే నిలువెత్తు నిజరూపాలనీ.
వామ పక్ష పార్టీలు ఊదరగొడుతన్నాయ్.

========================================

No comments:

Post a Comment