Tuesday, September 1, 2015

కవిత్వం ఎక్కువసార్లు ప్రాణ వాయువులా పనిచేస్తుంది.
గవక్షాల్లోంచి కిటికీల్లోంచి రివ్వున సాగుతూ వచ్చే
మలయ మారుతంలా మనసు నాహ్లాద పరుస్తుంది.


కలుషిత్మ్ కాని ఆహారంలా మనుషులకు శక్తినందిస్తుంది.
కనీసం జీవకోటికవసరమైన,తప్పకుండా  కావాల్సిన నిద్రలా
మనసుకు తగు విశ్రాంతినందించి హాయినిగొలుపుతుంది.
ఉత్తర ధృవాల దగ్గరగా పేరుకుపోయిన మంచు గుట్టలనుకూడా
అవలీలగా కరిగించగల సామర్ధ్యం కవితలకుందని మీకు తెలుసా?

కవిత్వాన్ని మనం కలికాలం ప్రభావంతో మత్తుజల్లి నిద్రబుచ్చుతున్నాం.

ఎక్కడకో దూర దూర తీరలకు సగనంపే ప్రక్రియలను ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభిస్తున్నాం.




మనస్సుయొక్క చాంచంల్యం మనిషిని కృంగదీస్తున్నప్పుడు
నడుస్తున్న చరిత్రంతా నెత్తురుతో చిత్రితమౌతున్నప్పుడు
మానవ మాత్రులమైన మనం చీకటికోణాల్లొంచి
దూసుకొచ్చే బొద్దింకలను చంపినట్లు వెలుగుదారులవెంట మనల్ను
నడిపించే కవితలను కాలక్రమంలో మృగ్యంచేసే మార్గాలనన్వేషిస్తున్నాం.
అభం శుభం తెలియని పిల్లలనందరినీ అనధాశ్రమాలకు తరలించే రీతిలో,అమాయకమైన ఆడపిల్లల్ను వ్యభిచారగృహాలకు
తరలించేలా కౄరంగా కాగితం మీద ముద్రితమై ఫెళ ఫెళ లాడుతూ
యావత్ప్రపంచాన్ని దాసోహమనిపించుకుంటున్న దేశపు కరెన్సీ నోటులా
జగత్తంతా మనీ వెంట గుడ్డిగా పరుగులుపెట్టించేలా దేశం దిగజారుడు వస్తువైనప్పుడు
జనాన్ని జాగృతంచేయగల కవిత్వమెవడికి కావాలని నిరసన ధ్వనులను నిరంతరం బజాయిస్తున్నాం.
===========================================================



No comments:

Post a Comment