Saturday, September 26, 2015

మరణ మృదంగనాదం
============================


ఎందుకో ఇప్పుడిక్కడ
చెట్లపై పక్షులు
 వాలడం మానేసాయ్.

పొలంగట్లపైమొలిచిన
బంతిపూల మొక్కలన్నీ
 మౌనవ్రతం పాటించాయ్.

పొలంలో నిలబెట్టిన
దిష్టిబొమ్మ
తను గగనం నుంచి వ్రాలే
గ్రద్దలకూ  దూడబోతులకూ
 కాపలా కాయలేనని
కన్నీళ్ళ పర్యంతమై నేలకొరిగింది.

అప్పుల ఊబిలోంచి
బయట పడే మార్గం తోచక
కర్షకులు గొంతులు నులుముకుంటుంటే
రాజకీయపు రాబందులు
చోద్యంచూస్తూ నిలుచుంటున్నాయ్.

ఈ కుంభకర్ణులను నిద్రలేపడమెలాగో తెలియక
కవిలోకం చెవిదగ్గరగా చావు డప్పు మోగిస్తూ
చైతన్యం కలిగించాలని
శతవిధాలా శ్రమపడుతూ స్వేదాన్నే సిరాగా
మార్చి మరీ కవితలనే
చెర్నా కోలాలతో అదిరించి బెదిరించాలని
చెమటోడుస్తూ ఎదురు చూస్తున్నది.
=====================================

No comments:

Post a Comment