Thursday, October 15, 2015

రక రకాల రంగులతో
హంగుగా దర్శనమిచ్చిన
ఆకాశo ఇవ్వళెందుకో
ఎలా తెలా పోతూ వేదన
 కలిగిస్తున్నది.

వసంతంవెళ్ళిoదన్న
విచారం తోనా?
శిశిరం కౌగిలిలిలో
నలిగిపోతా నేమోనన్న     భయంతోనా?
అర్ధమవడంలేదు.

కవిత్వo శీర్షికలో
కమ్మని కవితనై అలరిస్తానని
కమనీయ కంఠంతో చెప్పినా,
కళ్ళల్లో ఎలాంటి  వెలుగురేకలే మీ
విచ్చుకుoటున్న సూచన కనబడక
 ఆ ఆశ  కేవలం
నిరాశగా మాత్రమే   నిలిచిపోయింది.

సాహిత్యం వేదికపై
సమ్మోహనంగా
ఓ హృద్యమైన  పద్యం
వినిపిస్తానని ఆశపెట్టాను
దానిలో ఎలాంటిమార్పూ
 కనబడలేదు.
ఆందోళనకు లోనయాను.


Friday, October 2, 2015

మనసు మూగదాయెనురా
మాధవా! మధుసూదనా!!
కొనగోటిన త్రుంచబడిన సుమమువోలె
స్రుక్కి సోలి
తుదిఘడియలతీరెరుగక
తొందరపడి పోయితినేమొతెలియదు
 ఆమెకదియె అవసానదశయగునని
ఇపుడు వగచి యేమి ఫలము?

తోటలోని పూలడిగితె ఏమిచెప్పగలనునేడు?
ఆమె ఇక పోషణకై మీ చెంతకు
రాదురాదు  రాదటంచు
పూలతీగలన్ని నేడు వాడిపోవు దశకు జేరె
శక్తిమేర ఆమె కొర్కె నెరవేర్చెద నేను కూడ
కుండీలలొ నీరు నింపి ఎందుటాకులను యేరివేసి
నాచిన్నితోటనయిన ఆమె కొరకు పోషింతును
వాటి స్మితవదనమందు ఆమెరూపు చూసుకొందు
ఇప్పటికిదియే నావినతి ఆలకించుమయ్య స్వామి
మూగవోయిన మనసుకింత ఓదార్పునందివ్వుము
గతకాలపు స్మృతులనన్ని గుర్తుంచుము నాఎదలో
మనసు మూగదాయెనురా మాధవా !మధుసూదనా!!
*******************************************
అహింస అంటరానిదై దూరంగా
దూరంగా  జరుగుతున్నప్పుడు
హింసా ప్రవృత్తికలిగివుండడమే
 హితవైనదిగా తోచినప్పుడు
సత్యాన్ని వధించడమే  శాస్త్రసమ్మతంగా
చెలామణీ అవుతున్నప్పుడు,
ధర్మాన్ని చెరలో బంధించి
వేదనపాల్జేసినప్పుడు,
జాతిపితా నీకింకెలాగా
నివాళులందివ్వగలం నువ్వే చెప్పు!
సంవత్సరానికొకసారి నీ శిలావిగ్రహానికి
రంగులేసి పూలదండలతో అలంకరించి
పూజ్య భావాన్ని ప్రకటిస్తున్నట్లు
నటించడంలో నరుని మించిన
నటులెవ్వరున్నారని?
నువ్వే ఆశ్చర్యపోతావ్ !!
ఒకసారి ఇటువైపుకు తొంగిచూస్తే.
================================
జగతిప్రస్థానం
---------------------రావెల
===========================
ఈ యావత్ప్రపంచం ఎన్నో సంగతులను
తన స్వంతం చేసుకోవాలని తాపత్రయపడుతుంది.
విజ్ఞానం తనకందకుండా అభివృద్ధిజెందండం
 మనం చూస్తూనే వున్నాం,

కొన్ని విషయాలు కాలానికని కనుగుణంగా
మారడానికి ఎంతమాత్రం ఇష్టపడవు.

ప్రధమచుంబనమే అందుకు సోదాహరణం.
అదులోని మాధుర్యం ఎంతకాలంగడిచినా
వెగటనిపించదందుకే!!

ఈప్రపంచం ఎన్నింటినో సుదీర్ఘంగా
 బోధజేయాలనుకుంటుంది.
వసంతం ఎవరి అనుమతుల్లేకుండానే
సమయానికి కాలానుక్రమంలో  మన
వాకిళ్ళలోకొచ్చి వాలిపోతుంది.

పూలన్నీ అప్పుడే కొత్తగా రెక్కలుతొడుక్కుని
నవనవోన్మేషంగా తోటలన్నింటినీ
సౌందర్య రిరంసతో నవనవలాడడానికితోడ్పతుంది.
చలితనదుప్పటిని సరయిన సమయానికే
సర్వప్రాణికోటిమీదకు విసురుతుంది.
గ్రీష్మం రాగానే పిల్లలు తమసెలవులను
ఆటపాటలతో, కేకలూకేరింతలతో గడుపుతుంటారు.

ప్రపంచం ఎన్ని విధాలుగా ఆంక్షలు విధించినాసరే
కొన్ని సంగతులు సందర్భాలకనుగుణంగా ఎలాంటి మార్పులనూ
అంగీకరించడానికి ససేమిరా ఇష్టపడవు.
మొదటి చుంబన మాధుర్యం, ప్రధమంగా సమీపించిన
మృత్యుకౌగిలీ ,ఇంకా విషాదగీతాలనాలపించడానికి
అలవాటుపడిన గొంతుక ససేమిరా ఎలాంటి మార్పులకూ తలొగ్గవు.

[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో ---]           1-10-15
నాపేరు ముద్రితమైన వలపు బాణాలు
మన్మధాకారుడొకడు, సంధించడం మొదలెట్టాడు.
అవిసరిగ్గా నా గుండెకు సూటిగా తగిలాయి.
ఇప్పుడు నేను తరుణ వయస్కురాలినీ కాను
అర్ధరాత్రిదాకా ఉబుసుపోక సంభాషణలతో
కాలాన్ని వెచ్చించి దుబారాచేయగల మనస్తత్వమూకాదునాది.

అప్పుడు మన్మధుడు సూటిగా నావైపు తన దృక్కులను సారించాడు.
నీకు సహజంగా ప్రణయానురక్తిలేకపోతే ఇప్పటిదాకా ఎందుకు మేల్కొన్నట్లో!!
కేవలం మౌనాన్నాశ్రయించడం నావంతుగా మిగిలింది..
[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో]
======================================
ఏకాంతసేవ
=================


ఏకాతంలో ఎంత హాయిద్యోతకమౌతుందో
ఇప్పుడిప్పుడే నాకవగతమౌతుంది.
అర్ధంపర్ధంలేని కబుర్లతో
కాలాన్ని దుబారాగా వెచ్చించడం
ఎంత వృధాప్రయాసోకూడా అవగతమౌతున్నది.

అపార్ధాలకాశ్రయమివ్వగలిగినదే ఏకాంతం
నిరాకరణకాస్కారమిచ్చేదే గదా ఏకాంతమంటే
అన్ని సందర్భాలలోనూ అది అందమైన
వస్తుగుణాలను సంతరించుకోదు.

ఓ ధరణీ మాతా!!
నీహృదయమెంత విశాలమైనది
నీ బాహుబంధాలెంత అనురాగ భరితమైనవి.
ఇంతకాలం ఈసత్యాన్ని గుర్తెరిగడంకోసమేగదా
నన్ను జీవించమని నువ్వు ఆజ్ఞాపించైనది,

నదులు నిరంతరం ప్రవహిస్తూనే వున్నాయి
సుమాలన్నీ సుప్రభాతవేళకే వికసించి
పరిమళాను ప్రసరింపజేస్తూనే వున్నాయి.
ఇంతకన్నా అదృష్టమైన జీవితసందర్భమెక్కడైనా
ద్యోతకమౌతుమందా చెప్పవమ్మా!!====================

Thursday, October 1, 2015

జగతిప్రస్థానం
---------------------రావెల
============================

ఈ యావత్ప్రపంచం ఎన్నో సంగతులను
తన స్వంతం చేసుకోవాలని తాపత్రయపడుతుంది.
విజ్ఞానం తనకందకుండా అభివృద్ధిజెందండం
 మనం చూస్తూనే వున్నాం,

కొన్ని విషయాలు కాలానికని కనుగుణంగా
మారడానికి ఎంతమాత్రం ఇష్టపడవు.


ప్రధమచుంబనమే అందుకు సోదాహరణం.
అదులోని మాధుర్యం ఎంతకాలంగడిచినా
వెగటనిపించదందుకే!!

ఈప్రపంచం ఎన్నింటినో సుదీర్ఘంగా
 బోధజేయాలనుకుంటుంది.
వసంతం ఎవరి అనుమతుల్లేకుండానే
సమయానికి కాలానుక్రమంలో  మన
వాకిళ్ళలోకొచ్చి వాలిపోతుంది.


పూలన్నీ అప్పుడే కొత్తగా రెక్కలుతొడుక్కుని
నవనవోన్మేషంగా తోటలన్నింటినీ
సౌందర్య రిరంసతో నవనవలాడడానికితోడ్పతుంది.
చలితనదుప్పటిని సరయిన సమయానికే
సర్వప్రాణికోటిమీదకు విసురుతుంది.
గ్రీష్మం రాగానే పిల్లలు తమసెలవులను
ఆటపాటలతో, కేకలూకేరింతలతో గడుపుతుంటారు.



ప్రపంచం ఎన్ని విధాలుగా ఆంక్షలు విధించినాసరే
కొన్ని సంగతులు సందర్భాలకనుగుణంగా ఎలాంటి మార్పులనూ
అంగీకరించడానికి ససేమిరా ఇష్టపడవు.
మొదటి చుంబన మాధుర్యం, ప్రధమంగా సమీపించిన
మృత్యుకౌగిలీ ,ఇంకా విషాదగీతాలనాలపించడానికి
అలవాటుపడిన గొంతుక ససేమిరా ఎలాంటి మార్పులకూ తలొగ్గవు.

[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో ---]